
దేవీ శరన్నవరాత్రులు
తాండూరు రూరల్: ఐనెల్లిలో అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం శైల పుత్రి రూపంలో దర్శనమిచ్చారు. వికారాబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి దేవస్థానంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ పద్మనాభం ధ్వజారోహనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
– అనంతగిరి

దేవీ శరన్నవరాత్రులు

దేవీ శరన్నవరాత్రులు