‘పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నాగేందర్‌గౌడ్‌’ | - | Sakshi
Sakshi News home page

‘పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నాగేందర్‌గౌడ్‌’

Sep 12 2025 11:43 AM | Updated on Sep 12 2025 11:43 AM

‘పట్టభద్రుల ఎమ్మెల్సీ  బరిలో నాగేందర్‌గౌడ్‌’

‘పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నాగేందర్‌గౌడ్‌’

అనంతగిరి: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, విద్య, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ బరిలో ఉంటారని ఆయన కుమారుడు, రాష్ట్ర యువ నాయకుడు రాజేందర్‌ గౌడ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్‌లోని అమరువీరుల స్తూపానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం రాజేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర కాలం ప్రతీ పట్టభద్రుడిని కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగేందర్‌గౌడ్‌ తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రాములు, వెంకటేశ్‌, వెంకటేశ్‌గౌడ్‌, చందు, మహేందర్‌, శ్రీశైలం యాదవ్‌, మల్లేశం, నర్సింలు యాదవ్‌, విజయ్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement