అడవుల పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అడవుల పరిరక్షణే ధ్యేయం

Sep 12 2025 10:12 AM | Updated on Sep 12 2025 10:12 AM

అడవుల పరిరక్షణే ధ్యేయం

అడవుల పరిరక్షణే ధ్యేయం

జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌

అమరులకు ఘన నివాళి

అనంతగిరి: అడవుల పరిరక్షణే ధ్యేయమని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వికారాబాద్‌లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నర్సరీల్లో మిగిలిన మొక్కల నిర్వహణ, సంరక్షణ గురించి చర్చించారు. వర్షాలు కురుస్తున్నందునా అవెన్యూ ప్లాంటేషన్‌కి అనువైన ప్రాంతాలను గుర్తించి ప్లాంటేషన్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కే. శ్యాం కుమార్‌, రాజేందర్‌, శ్రీదేవి సరస్వతి, పరిగి రేంజ్‌ ప్రతిమ, కొడంగల్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సవిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement