వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Sep 9 2025 12:58 PM | Updated on Sep 9 2025 12:58 PM

వ్యవసాయ కార్మికుల  సమస్యలు పరిష్కరించాలి

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

షాద్‌నగర్‌: వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షు డు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్‌ ఆర్‌డీఓ సరితను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హా మీని నెరవేర్చాలని అన్నారు. రైతులకు కావాల్సి న యూరియాను వెంటనే పంపిణీ చేయాలని డి మాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య, రమేష్‌ యాదవ్‌, దామోదర్‌రెడ్డి,వెంకటయ్య,షేక్‌ ఉస్మాన్‌, కిష్టయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement