శోభాయమానంగా గిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

శోభాయమానంగా గిరి ప్రదక్షిణ

Sep 8 2025 9:58 AM | Updated on Sep 8 2025 9:58 AM

శోభాయ

శోభాయమానంగా గిరి ప్రదక్షిణ

దోమ: వీరభద్రేశ్వర ఆలయంలో ప్రదక్షిణ

కుల్కచర్ల: గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు

కుల్కచర్ల: పౌర్ణమి సందర్భంగా ఆదివారం పాంబండ రామలింగేశ్వరాలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు రుద్రహోమం నిర్వహించి అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మహిపాల్‌ రెడ్డి, కుల్కచర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, అర్చకులు పాండు శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వీరభద్రేశ్వర స్వామికి రుద్రాభిషేకం

దోమ: మండల పరిధిలోని గూడూరులో ఆదివారం గ్రామస్తులు వీరభద్రేశ్వర స్వామికి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు జంగం శివ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయం చూట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శేరి రాంరెడ్డి, శివకుమార్‌, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సాయిరెడ్డి, మహేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సతీశ్‌ కుమార్‌, ఆనంద్‌ కుమార్‌, బుగ్గారెడ్డి, ప్రసాద్‌కుమార్‌, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

శోభాయమానంగా గిరి ప్రదక్షిణ 1
1/1

శోభాయమానంగా గిరి ప్రదక్షిణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement