యూరియా వచ్చింది.. కలత తీరింది! | - | Sakshi
Sakshi News home page

యూరియా వచ్చింది.. కలత తీరింది!

Sep 8 2025 9:58 AM | Updated on Sep 8 2025 9:58 AM

యూరియా వచ్చింది.. కలత తీరింది!

యూరియా వచ్చింది.. కలత తీరింది!

యాచారం: యూరియా కొరత కారణంగా నిన్నమొన్నటి వరకు కర్షకులు కలత చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సాగు పనులు వదిలి.. శాంతపొడవుగా పీఏసీఎస్‌, ఫర్టిలైజర్‌ దుకాణాల వద్ద గంటల కొద్దీ క్యూ కట్టారు. దీనికి స్పందించిన ప్రభుత్వం, అధికారులు.. ‘యూరియా కోసం రైతు లు ఇబ్బంది పడొద్దు. అవసరం మేరకు స్టాక్‌ వస్తోంది. అందరికీ అందజేస్తాం’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. తాజాగా సెలవు రోజైన ఆదివారం.. యా చారం మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ చేశా రు. 450 మందికి టోకెన్లు ఇచ్చి, పోలీసుల సమక్షంలో ఒకొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశా రు. సరఫరా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ త నాలుగైదు దఫాలుగా యూరియా కోసం వంద లాది మంది రైతులు ఆందోళన చెసిన విషయం విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement