
పచ్చని చెట్లపై గొడ్డలివేటు
ధారూరు: అధికారుల అనాలోచిత చర్యతో పచ్చని చెట్లపై గొడ్డలివేటు పండింది. గురువారం మండల పరిధిలోని హరిదాస్పల్లి–చింతకుంట గ్రామాల మధ్యన విద్యుత్ తీగలకు తాకుతున్నాయన్న కారణంతో చెట్లను కాండం వరకు నరికేశారు. గతంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కలను నాటారు. ఆ సమయంలో ట్రాన్స్కో, ఉపాధిహామీ సిబ్బందికి సమన్వయం లోపించడంతో మొక్కల పైనుంచి విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెట్లు పెద్దవి కావడంతో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నరికేస్తున్నారు. నాటేటప్పుడే అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.