పచ్చని చెట్లపై గొడ్డలివేటు | - | Sakshi
Sakshi News home page

పచ్చని చెట్లపై గొడ్డలివేటు

May 30 2025 6:59 AM | Updated on May 30 2025 6:59 AM

పచ్చని చెట్లపై గొడ్డలివేటు

పచ్చని చెట్లపై గొడ్డలివేటు

ధారూరు: అధికారుల అనాలోచిత చర్యతో పచ్చని చెట్లపై గొడ్డలివేటు పండింది. గురువారం మండల పరిధిలోని హరిదాస్‌పల్లి–చింతకుంట గ్రామాల మధ్యన విద్యుత్‌ తీగలకు తాకుతున్నాయన్న కారణంతో చెట్లను కాండం వరకు నరికేశారు. గతంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కలను నాటారు. ఆ సమయంలో ట్రాన్స్‌కో, ఉపాధిహామీ సిబ్బందికి సమన్వయం లోపించడంతో మొక్కల పైనుంచి విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెట్లు పెద్దవి కావడంతో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నరికేస్తున్నారు. నాటేటప్పుడే అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement