
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
యాలాల: మండలంలోని జుంటుపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. ఈ విషయమై ఆదివారం కాంగ్రెస్ నాయకులు కేంద్రం వద్ద కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు రైతులకు ముందస్తుగా 60 వేల గన్నీ బ్యాగులు అందించారన్నారు. తేమ శాతం ఉన్న 38 వేల బ్యాగుల వరి ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించిన ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేష్కుమార్, ఆశప్ప, ఆంజనేయులు, శాంతుకుమార్, రాంచందర్, ఎల్లప్ప పాల్గొన్నారు.