
అటవీ భూమిలో ఇంటి నిర్మాణం
కుల్కచర్ల: అటవీ భూమిలో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్న ఆ శాఖ అధికారిపై దురుసుగా ప్రవరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెరువుముందలి తండా(కే)కు చెందిన కేతావత్ భాషా, అతని కుమారుడు నంద్యనాయక్ అటవీ భూమిలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ మంగవారం ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో కేతావత్ భాషా, నంద్యనాయక్ శ్రీధర్ను అసభ్య పదజాలంతో ధూషించారు. దీంతో శ్రీధర్ బుధవారం కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
అడ్డుకున్న అధికారిపై దూషణ
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు