మొండి చేయి! | - | Sakshi
Sakshi News home page

మొండి చేయి!

Jun 9 2025 7:58 AM | Updated on Jun 9 2025 8:06 AM

మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు దక్కని అమాత్య యోగం

రేసులో టీఆర్‌ఆర్‌

రెండు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. తదనంతర పరిణామాల్లో పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ మారినప్పటికీ ఆయన పార్టీ జెండాను విడువలేదు. కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితుల్లో ఉండగా బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీని వీడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 20 వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ సేవలందిస్తూ వస్తున్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేస్తూ విధేయుడిగా ఉంటాడనే పేరుంది. పార్టీ పెద్దలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేలతో పరిచయాలున్న నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తూ వచ్చారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మరోసారి జరిగే విస్తరణ వరకు వేచి ఉంటానని పేర్కొంటున్నారు. మాజీ మంత్రి, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి మంత్రి వర్గంలో చోటు కోసం యత్నిస్తూ వచ్చినా చివరకు నిరాశే ఎదురైంది.

వికారాబాద్‌: మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు నిరాశే ఎదురైంది. ఆది నుంచీ జిల్లాలో ముగ్గురు నేతలు మంత్రి పదవిని ఆశించగా మొదటి కూర్పులో అవకాశం దక్కలేదు. రెండో విస్తరణలోనైనా చాన్స్‌ దక్కుతుందని భావించినా మొండిచేయి మిగిలింది. సామాజిక సమీకరణలను స్వాగతిస్తున్నామంటూనే తాము సైతం రేసులో ఉన్నామని జిల్లా నేతలు ప్రకటనలు చేస్తూ వచ్చారు. మున్ముందు విస్తరణలో తమకు బెర్త్‌ ఖరారు అంటూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ముందున్నారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి ముందునుంచీ రేసులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. గతంలో జిల్లా నుంచి ఇద్దరు మంత్రి పదవులు చేపట్టినా అభివృద్ధికి నోచుకోలేదు. జిల్లా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉండగా మరో మంత్రి పదవి ఎందుకనే వాదన ఉండగా.. మర్రిచెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారంటూ ఆశావహులు పేర్కొంటున్నారు.

మంత్రి పదవిపైనే మమకారం

గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో జౌళిశాఖ మంత్రిగా పనిచేసిన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మొదటి విడతలోనే మంత్రి పదవిని ఆశించి చివరి వరకు పోరాడారు. ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్‌రెడ్డి ప్రసాద్‌ కుమార్‌కు మంత్రి పదవి ఖాయమని హామీ ఇచ్చారు. కాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణాల్లో ఆయనకు స్పీకర్‌ పదవిని కట్టబెట్టారు. రెండో దఫా విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వ, పార్టీ పెద్దలను కోరారు. తన బావమరిదికి వివేక్‌కు స్పీకర్‌ పదవి కట్టబెట్టి తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని చివరి వరకు ప్రయత్నించారు. ఆదివారం మంత్రి వర్గవిస్తరణలో ఆయన పేరు లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారని సన్నిహితులు పేర్కొంటున్నారు.

గడ్డం

ప్రసాద్‌కుమార్‌

పట్నం మహేందర్‌రెడ్డి

ఆది నుంచీ ఆశలు పెట్టుకున్నస్పీకర్‌, డీసీసీ అధ్యక్షుడు, మండలి విప్‌

రెండో విడతలోనూ తప్పని నిరాశ

మలి విడత కోసం ఎదురుచూపులు

మొండి చేయి!1
1/3

మొండి చేయి!

మొండి చేయి!2
2/3

మొండి చేయి!

మొండి చేయి!3
3/3

మొండి చేయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement