ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం

Jun 11 2025 11:57 AM | Updated on Jun 11 2025 11:57 AM

ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం

ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం

● సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం ● టీజేఎస్‌, బీఎస్పీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

తాండూరు: ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలకు దూరమైందని టీ జేఎస్‌, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎస్‌ సోమశేఖర్‌, దొరశెట్టి సత్యమూర్తి ఆరోపించా రు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రా వును అరెస్టు చేయడాన్ని, ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ మూకలు దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాండూరు పట్టణం మంగళవా రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాలు, టీజేఎస్‌, బీఎస్పీ నా యకులు,ఎన్‌ఎస్పీ ట్రస్ట్‌ ప్రతినిధులు నల్ల బ్యా డ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర స్థాయి లో వ్యతిరేకత మూటగట్టుకుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులను ప్రతి ఒక్క రూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్‌ ప్రతినిధి భానుప్రసాద్‌,పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పీశ్రీనివాస్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, బీఎస్పీ నాయకులు అమ్జాద్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement