
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు..
దరఖాస్తుల ఆహ్వానం
● ఈ నెల 23 వరకు అవకాశం ● అర్హులైన విద్యార్థినులుసద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు అర్హులైన మహిళా విద్యార్థినులు ఈ నెల 23 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్కు సంబంధించిన డిగ్రీ మహిళా కళాశాల మొయినాబాద్ మండలం, తోలు కట్ట సమీపంలో ఉందన్నారు. కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ), బీకాం (బీఏ, సీఏ), బీఏ (హెచ్ఈపీ) కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ మార్కుల మెమో (అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీసర్), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, 5 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు జనవరి 2025 తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం(గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదా యం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి ఆదాయం రూ.2 లక్షలలోపు)తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఈఓ రేణుకాదేవి, డీసీఓ సాయిలత, కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ విజయ కోట, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో హాజరుకావాలి
జిల్లాలో యూడీఐడీ/ సదరం క్యాంపులకు దివ్యాంగులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు అంగవైకల్యానికి సంబంధించి జూన్ 13, 19, 24, 25 తేదీల్లో, బుద్ధి మాంద్యం గలవారికి జూన్ 17, 18న, మూగ, చెవుడు గత వారికి జూన్ 26న, అంధులకు జూన్ 27న క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఫోన్ ద్వారా సమచారం పంపుతామని తెలిపారు. వారు మాత్రమే క్యాంపులకు హాజరు కావాలని సేచించారు.