
పండుగలా ప్రారంభం
అట్టహాసంగా తెరచుకున్న పాఠశాలలు
● విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ● తరగతి గదులను అందంగా ముస్తాబు చేసిన సిబ్బంది ● పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల అందజేత ● మొదటి రోజుసరదాగా గడిపిన చిన్నారులు
వికారాబాద్: వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో 50శాతం లోపే విద్యార్థులు వచ్చారు. చాలా చోట్ల స్కూల్ సమయం కంటే ముందుగానే చేరుకున్నారు. బడి గంట మోగగానే కొందు పరిగెత్తుకు రావడం కనిపించింది. పలు పాఠశాలల్లో తరగతి గదులను మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. మొదటి రోజు కావడంతో చిన్నారులు సరదాగా ఆడుకోవడం కనిపించింది. జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో దాదాపు 80వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 74,967 యూనిఫారాలు, 5,27,290 పాఠ్యపుస్తకాలు, నోటు పుసక్తకాలు 5,21,904 పాఠశాలలకు చేరాయి. వాటిని విద్యార్థులకు అందజేశారు.
సర్కారు బడుల్లో చేర్పించండి
అనంతగిరి: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ తల్లిదండ్రులకు సూచించారు. గురువారం పాఠశాలల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠఽశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బాబుసింగ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయలక్ష్మి, హెచ్ఎం శ్రీశైలం, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వీరేశం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తములుగా తీర్చిదిద్దాలి
బంట్వారం: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని డీఈఓ రేణుకాదేవి అన్నారు. గురువారం మండలంలోని బొప్పునారం యూపీఎస్లో విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకల్లో ఆమె పాల్గొని మా ట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభు త్వ బడుల్లోనే చేర్పించాలని సూచించారు. నాణ్యమైన బోధనతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందిస్తున్నామ న్నారు. ఉపాధ్యాయులు స్థానికుల సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. పాఠశాలలో తర చూ తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. చదువు లో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమన్నారు. ప్రతిరోజూ దినపత్రికలు, పుస్తకాలు చదవటం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. శారీరక దృఢత్వం కోసం క్రీడలు ఆడాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్రావు, ఉపాధ్యాయులు విక్రమ్రెడ్డి, అంజమ్మ, రజిని, గ్రామస్తులు పాల్గొన్నారు.