అభివృద్ధి పథంలో కొడంగల్‌ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో కొడంగల్‌

Jun 13 2025 7:19 AM | Updated on Jun 13 2025 7:19 AM

అభివృద్ధి పథంలో కొడంగల్‌

అభివృద్ధి పథంలో కొడంగల్‌

● సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో వేగంగా సాగుతున్న పనులు ● కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి ● లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

కొడంగల్‌: అభివృద్ధి పథంలో కొడంగల్‌ దూసుకుపోతోందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కడా కార్యాలయంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని ఎనిమిది మండలాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 10 వేల కోట్లతో వివిధ పనులు ప్రారంభించామని చెప్పారు. కొడంగల్‌కు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కాలేజీలు మంజూరయ్యాయని వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని 220 బెడ్లకు విస్తరించడంతో పాటు టీచింగ్‌ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్‌ చేశారన్నారు. అర్హులందరికీ రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు అందిస్తున్నామని చెప్పా రు. అనంతరం పట్టణంలోని ప్రకృతి వనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడా అధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అంబయ్యగౌడ్‌, మహ్మద్‌ యూసూఫ్‌, నందారం ప్రశాంత్‌, నయీమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌, తహశీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ ఉషశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement