రైతులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు న్యాయం చేయాలి

Jun 13 2025 7:19 AM | Updated on Jun 13 2025 7:19 AM

రైతులకు న్యాయం చేయాలి

రైతులకు న్యాయం చేయాలి

అనంతగిరి: వరి కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ అన్నారు. గురువారం యాలాల మండలం జంటుపల్లి రైతులతో వచ్చి కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను కలిశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. స్పందించిన కలెక్టర్‌ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం శుభప్రద్‌పటేల్‌ మాట్లాడుతూ.. తరుగు పేరు తో రైతులను మోసం చేస్తూ 41 కిలోలకు కాంట పెట్టడానికి బదులు 43 కిలోలు తీసుకుంటున్నా రని తెలిపారు. రైస్‌ మిల్లర్లు సైతం 50 బస్తాలు ఉన్న రైతు దగ్గర రెండు బస్తాలు, 70 బస్తాలు ఉంటే 3 బస్తాలు, 100 బస్తాలకు 5 బస్తాలు, 150 బస్తాలకు 8 బస్తాలు కట్‌ చేస్తూ రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాధిత రైతులు రాంచందర్‌ శాంతప్ప, గోవర్దన్‌ గౌడ్‌, సోను, గోవింద్‌, నాయకులు రవిశంకర్‌, సిద్దిఖ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement