అర్హులందరికీ ‘సంక్షేమం’ | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ‘సంక్షేమం’

Jun 13 2025 7:19 AM | Updated on Jun 13 2025 7:19 AM

అర్హు

అర్హులందరికీ ‘సంక్షేమం’

తాండూరు/తాండూరు రూరల్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి అన్నారు. రూ.2.21 కోట్లతో తాండూరులో నిర్మించనున్న మురుగు కాల్వలకు వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగానే చిలుక వాగు ప్రక్షాళన, మురుగు కాల్వల నిర్మాణ పనులను చేపట్టామని స్పష్టంచేశారు. భారీ వర్షాలు కురిస్తే మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నాని తెలిపారు. గత పాలకులు నిర్లక్ష్యంతోనే చిలుకవాగు నిరాదరణకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది, మాజీ కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ సబ్సిడీ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ అందేలా చూడాలన్నారు. కాగ్నా నది పంప్‌ హౌస్‌ మోటార్లను కాలం చెల్లాయని కొత్త మోటార్లను బిగించాలని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేశామని, నిర్మాణాలు ప్రారంభించుకోవా లని చెప్పారు. కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభు త్వం రూ.90 కోట్ల నిధులు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లా ల, మాజీ కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, సోమశేకర్‌, మమత, పలువురు నాయకులుపాల్గొన్నారు.

చాలా ఆనందంగా ఉంది..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తన చేతులమీదుగా పట్టాలు అందజేయడం చాలా ఆనందంగా ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా ఇంత సంతోషాన్ని అనుభవించలేదని మనోహర్‌రెడ్డి అన్నారు. తాండూరు, పెద్దేముల్‌ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అంతకుముందుకు ఇందిరమ్మ నమూనా ఇంటితో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిపై ఎమ్మెల్యేను ఊరేగించారు. అన ంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎమ్మార్‌ మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. ఆయన వర్షంలోనే తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించగా, మహిళలు తాము కూర్చున్న కుర్చీలను త లపై పట్టుకుని ఆసక్తిగా విన్నారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడు రమేష్‌ మహరాజ్‌, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సూజత, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌, కాంగ్రెస్‌ బ్లాక్‌ ఏ అధ్యక్షుడు లొంక నర్సిములు, మండలాల అధ్యక్షుడు నాగప్ప,గోపాల్‌, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి

తాండూరు, పెద్దేముల్‌లో పర్యటన

చిలుగవాగు పరిశీలన, ఇందిరమ్మ పట్టాల పంపిణీ

అర్హులందరికీ ‘సంక్షేమం’1
1/1

అర్హులందరికీ ‘సంక్షేమం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement