బలమైన శక్తిగా భారత్‌ | - | Sakshi
Sakshi News home page

బలమైన శక్తిగా భారత్‌

Jun 13 2025 7:19 AM | Updated on Jun 13 2025 7:19 AM

బలమైన శక్తిగా భారత్‌

బలమైన శక్తిగా భారత్‌

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి

అనంతగిరి: ప్రపంచంలోనే మనదేశం నేడు నాల్గవ

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వికసిత్‌ భారత్‌ అమృత్‌ కాల్‌ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధా న రోడ్డు వద్ద ఎగ్జిబిషన్‌న్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. నేడు దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ఈ నెల 17నుంచి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి మోదీ పాలనను ప్రజల కు వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ల అమలులో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్‌ ట్రెజరర్‌ విజయ్‌సూరన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, జిల్లా కన్వీనర్‌ శేరి శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వివేకానందరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, రాష్ట్ర నాయకురాలు సుచరితారెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజ్‌గౌడ్‌,, జిల్లా నాయకులు బస్వలింగం,శ్రీ కాంత్‌రెడ్డి, నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement