
తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్
● అత్యంత మన్నికై నది భారతి అల్ట్రా ఫాస్ట్ ● ఇంజనీర్లతో కంపెనీ టెక్నికల్ మేనేజర్ సునీల్ సమావేశం
తాండూరు టౌన్: వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ వర్ధిల్లుతోందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ అన్నారు. బుధవారం స్థానిక దుర్గా గ్రాండ్యుయర్ హోటల్లో పలువురు ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఎంతో నాణ్యమైనదన్నారు. దీంతో నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. అల్ట్రా ఫాస్ట్ సిమెంట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణాన్ని చేపడితే ఎక్కువ కాలం నిలుస్తాయన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన ఇంజనీర్లు భారతి సిమెంట్ కంపెనీ తరఫున ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామన్నారు. నేరుగా సైట్ వద్దకు వచ్చి సహాయం చేస్తారన్నారు. మార్కెట్లో ఉన్న ఇతర సిమెంట్ రకాలతో పోలిస్తే భారతి ఆల్ట్రా ఫస్ట్ రూ.20 అధికంగా ఉందన్నారు. అనంతరం డీలర్ రవీందర్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ ఎంతో మన్నిక కలదని, సర్వీస్ విషయంలో ఎంతో వేగంగా స్పందిస్తారన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సతీష్ రాజు, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వీరాంజనేయ రెడ్డి, టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.