నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Jun 11 2025 11:57 AM | Updated on Jun 11 2025 11:57 AM

నకిలీ

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

● జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి

నవాబుపేట: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నవాబుపేట మండలం పులుమామిడి గ్రామంలోని ఫెర్టిలైజర్‌ షాపును తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విత్తనాలు కొనే ముందు రైతు లు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన షాపుల్లోనే కొనుగోలు చేయాలన్నారు. అనంతరం గ్రామంలో పత్తి పంటను పరిశీలించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈఓలు, రైతులు ఉన్నారు.

విత్తన దుకాణాల్లో తనిఖీ

కొడంగల్‌: పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను టాస్క్‌ఫోర్స్‌ బృందం, పోలీసులు, వ్యవసాయాధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా, బిల్లులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించా రు.ఎమ్మార్పికే విత్తనాలు విక్రయించాలన్నారు. లై సెన్సు లేకుండా ఎరువులు, విత్తనాలు అమ్మితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్న నాసిరకం విత్తనాలను విక్రయిచరాదన్నారు. రైతుల నుంచి ఫిర్యా దులు వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. తనిఖీ ల్లో ఏడీఏ శంకర్‌ రాథోడ్‌, ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఓ తులసీ, టాస్క్‌ఫోర్సు సిబ్బంది పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు1
1/1

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement