ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా

Jun 9 2025 8:06 AM | Updated on Jun 9 2025 8:06 AM

ప్రజా

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా

మీర్‌పేట: ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా సీపీఐ పని చేస్తుందని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. లెనిన్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ 6వ మహాసభకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారితో కలిసి జంగయ్య హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజంలో తీవ్ర అసమానతలు పెరిగిపోతున్నాయని, అసమానతలు లేని సమాజం కష్టజీవుల శ్రామికుల సమాజం ఎర్రజెండా ద్వారానే సాధ్యమని అన్నారు. దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మావోయిస్టులను వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీపీఐ బాలాపూర్‌ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ముకుందంగారి చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా జటోత్‌ రెడ్యానాయక్‌, కౌన్సిల్‌ సభ్యులుగా పిచ్చిరాజు, డేరంగుల శంకరయ్య, జాజుల అంజయ్య, శివ, బండ యాదమ్మ, రమాపాండునాయక్‌, ఛత్రునాయక్‌, వీరాస్వామి, కౌసల్య, దేవయ్య, రమేష్‌, మిరియాల లక్ష్మమ్మ, పద్మ ఎన్నికయ్యారు.

సందడిగా బోనాల ఊరేగింపు

సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా 1
1/2

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా 2
2/2

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement