భూ భారతితో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యల పరిష్కారం

Jun 5 2025 8:12 AM | Updated on Jun 5 2025 8:12 AM

భూ భారతితో సమస్యల పరిష్కారం

భూ భారతితో సమస్యల పరిష్కారం

తాండూరు సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్‌

కొడంగల్‌: భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని తాండూరు సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని టేకుల్‌కోడ్‌ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహశీల్దార్‌ విజయ్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది

తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు ఉంటే తెలియజేయండి

దుద్యాల్‌: భూ భారతి చట్టం రైతులకు చుట్టంలాంటిదని తహసీల్దార్‌ కిషన్‌ అన్నారు. ఈర్లపల్లి గ్రామంలో రైతు సదస్సులో మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్నా, ఫిర్యాదులు చేయాలన్నారు. ఉప తహసీల్దార్‌ వీరేశ్‌ బాబు, ఆర్‌ఐ నవీన్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఫకీరప్ప, రికార్డు అసిస్టెంట్‌ ఊషప్ప తదితరులు పాల్గొన్నారు.

రైతులకు మేలు..

కుల్కచర్ల: భూ భారతి సదస్సులతో రైతులకు మేలు చేకూరనుందని తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి అన్నారు. పుట్టపహాడ్‌ రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ..భూములకు సంబంధించిన సమస్యలపై అవగాహన లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దీంతో సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. డిప్యూటి తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, గిర్దవరులు ఖాజ, రవి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పనిష్కారానికే..

బంట్వారం: భూ సమస్యల పరిష్కారినికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తహశీల్దార్‌ మహేష్‌ అన్నారు. సుల్తాన్‌పూర్‌, నూరుల్లాపూర్‌ సదస్సులో 26 దరఖాస్తులను డీటీ మహేశ్‌ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రాంగోపాల్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కోట్‌పల్లి మండలంలో..

కోట్‌పల్లి మండలంలోని ఇందోల్‌, ఓగులాపూర్‌ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి 11 దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రెవెన్యూ సదస్సుకు దరఖాస్తుల వెల్లువ

యాలాల: భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహశీల్దార్‌ వెంకటస్వామి తెలిపారు. చెన్నారంలో 3, ఎన్కెపల్లిలో 1, నాగసముందర్‌లో 2 వచ్చాయన్నారు. డీటీ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఐ వేణు, జూనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మోమిన్‌పేటలో..

మోమిన్‌పేట: కోల్కుంద, రావులపల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 10 దరఖాస్తులు వచ్చాయని తహశీల్దార్‌ రవీందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, అర్‌ఐలు గోవర్ధన్‌, సరిత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

తాండూరు రూరల్‌: రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు తహశీల్దార్‌ తారాసింగ్‌ అన్నారు. వీర్‌శెట్టిపల్లి, గోనూర్‌ గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గోనూర్‌లో–11, వీర్‌శె ట్టిపల్లిలో ఎలాంటి దరఖాస్తులు రాలేదని తహశీల్దార్‌ తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్‌ లలిత, ఆర్‌ఐ గోపి తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

దోమ: ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్‌ గోవిందమ్మ అన్నారు. పోతిరెడ్డిపల్లి, బట్లచందారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో 19 దరఖాస్తులు స్వీకరించారు. డిప్యూటీ తహశీల్దార్‌ నర్సింహులు, ఆర్‌ఐలు సుదర్శన్‌, రాంచంద్రరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ పర్వేజ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సరిత, యాదయ్య, మోహన్‌, శ్రీనివాస్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement