
పిచ్చి.. పరాకాష్ట
తాండూరు టౌన్: పిచ్చి పరాకాష్టకు చేరిందంటే ఇదేనేమో.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో తన ఫెవరేట్ జట్టు కాకుండా, వేరే జట్లు గెలిస్తే అరగుండు కొట్టించుకొని, మెడలో చెప్పుల దండ వేసుకుని బస్టాండులో తిరుగుతానని తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టు పెట్టాడు. ఈ నెల 3న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోయి.. ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సదరు యువకుడు చాలెంజ్ చేసిన విధంగా అరగుండు కొట్టించుకొని, మెడలో చెప్పుల దండ వేసుకుని బుధవారం తాండూరు బస్టాండులో తిరిగాడు. ఈ వీడియోను తిరిగి పోస్టు చేసి చాలెంజ్ను నిలబెట్టుకున్నానంటూ చెప్పడం విశేషం. అంతేకాకుండా క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ముంబై, పంజాబ్ జట్లు తలపడతుండగా పంజాబ్ గెలిస్తే షర్టు లేకుండా చౌరస్తాలో తిరుగుతానని ఇన్స్ట్రాగాంలో పోస్టు పెట్టాడు. ఆ రోజు మ్యాచ్లో పంజాబ్ గెలవడంతో షర్టు విప్పి అర్ధనగ్నంగా తాండూరు చౌరస్తాలో తిరిగాడు. ఇలా షర్టు లేకుండా తిరగడం, అరగుండు, మెడలో చెప్పుల దండతో తిరిగిన యువకున్ని చూసి జనాలు అవాక్కయ్యారు. పిచ్చి ముదిరితే ఇలాంటి చేష్టలే చేస్తారని, ఈ రోజు చేసిన ఈ చిన్న చాలెంజ్, భవిష్యత్లో పెద్ద పెద్ద చాలెంజ్లు చేసే పరిస్థితికి వస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువకులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలే తప్ప, ఇలాంటి చాలెంజ్లు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోరాదని హితవు పలుకుతున్నారు.
ఆర్సీబీ గెలిచినందుకు అరగుండు, చెప్పుల దండతో తిరిగిన యువకుడు
ఇన్స్టా గ్రామ్లో చేసిన చాలెంజ్ను నిలబెట్టుకున్నానంటూ పోస్టు