వైభవంగా ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

Jun 8 2025 7:20 AM | Updated on Jun 8 2025 7:20 AM

వైభవం

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

తాండూరు టౌన్‌: తాండూరు పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవ వేడుకలు పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో శనివారం వైభవంగా జరిగాయి. ఉదయం 7గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకరణ. మహా మంగళ హారతి, 9గంటలకు గణపతి హోమం, మహా నైవేద్యం, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద విత రణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ర్కండేయ కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులను మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.

పెద్దేముల్‌ ఎస్‌ఐగా

ప్రశాంత్‌వర్ధన్‌

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ ఎస్‌ఐగా ప్రశాంత్‌ వర్ధన్‌ శనివా రం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన శ్రీధర్‌రెడ్డి సంగారెడ్డికి బదిలీపై వెళ్లారు. టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న ప్రశాంత్‌ వర్ధన్‌ను పెద్దేముల్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

పేదల సంక్షేమమే

ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

దోమ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శివారెడ్డిపల్లిలో మూడు నెలల రేషన్‌ కోటా బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు యూడు నెలల బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తు న్నట్లు చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల యూత్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైలు కిందపడి

యువకుడి ఆత్మహత్య

తాండూరు టౌన్‌: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తాండూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన వాగ్మాడే సుమన్‌ (24) కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు శవాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని తండ్రి ముకుందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

కోట్‌పల్లి ఎస్‌ఐగా శైలజ

బంట్వారం: కోట్‌పల్లి ఎస్‌ఐగా శైలజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన అబ్దుల్‌ గఫార్‌ డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీసీఆర్‌బీలో పనిచేసే శైలజను ఇక్కడికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం  
1
1/4

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

వైభవంగా ఆలయ వార్షికోత్సవం  
2
2/4

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

వైభవంగా ఆలయ వార్షికోత్సవం  
3
3/4

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

వైభవంగా ఆలయ వార్షికోత్సవం  
4
4/4

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement