విహార యాత్రకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

విహార యాత్రకు వెళ్లి..

Jun 8 2025 7:15 AM | Updated on Jun 8 2025 7:15 AM

విహార యాత్రకు వెళ్లి..

విహార యాత్రకు వెళ్లి..

దుద్యాల్‌: దైవ దర్శనాల కోసం బైక్‌పై బయల్దేరిన ఇద్దరు స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌ జిల్లా దుద్యాల్‌ మండల పరిధిలోని గౌరారం గ్రామానికి చెందిన కమ్మరి జగన్నాథచారి, సరిత దంపతుల కుమారుడు చందుచారి హైదరాబాద్‌లోని వేద పాఠశాలలో చదువుతున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్‌ అనే స్నేహితుడితో కలిసి ఇటీవల విహార యాత్రగా బైక్‌పై తిరుపతి, అరుణాచలం బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో చందు (19) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన శివకుమార్‌ రేణిగుంట ప్రభుత్వ ఆసస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా అక్కడి పోలీసులు శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

రేణిగుంట వద్ద బైక్‌ యాక్సిడెంట్‌

గౌరారం గ్రామానికి చెందిన వేద పాఠశాల విద్యార్థి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement