
పర్యావరణాన్ని కాపాడుకుందాం
అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నా టాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు, పీపీలు దీపారాణి, అన్వేష్సింగ్, సమీనాబేగం, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
14న జాతీయ లోక్అదాలత్
ఈ నెల 14న జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్అదాలత్పై జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీపడదగ్గ కేసులను అధిక సంఖ్యలో రాజీపడేలా చూడాలని ఆదేశించారు. లోక్ అదాలత్లో రాజీకుదుర్చుకుంటే ఇద్దరు గెలిచినట్లే అవుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు. ఈ విషయంలో పోలీసులు ఆయా పీఎస్ల వారీగా రాజీకీ అస్కారం అవకాశం ఉన్న కేసులు ఉన్న వారిని రాజీకుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి వెంకటేశ్వర్లు, ఎస్పీ నారాయణరెడ్డి, పబ్లిక్ ప్రాస్యిక్యూటర్ దీపారాణి అన్వేష్సింగ్, సమీనాబేగం, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, దానయ్య, సీఐలు భీంకుమార్, సంతోష్, నగేష్, శ్రీనివాస్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి