
భూ భారతితో సమస్యల పరిష్కారం
బొంరాస్పేట: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి, తిర్మలాపూర్ గ్రామాలకు సంబంధించి ఎన్కేపల్లిలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. తిర్మలాపూర్ నుంచి ఎలాంటి వినతులు రాలేదు. ఎన్కేపల్లిలో 9 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐలు రవి, శైలజ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్