
దివ్యాంగుల భవనాన్ని ప్రారంభించాలి
హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్
పరిగి: పరిగి పట్టణ కేంద్రంలో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని వెంటనే ప్రారంభించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా దాదాపు రూ.7 లక్షల వ్యయంతో నిర్మించారని గుర్తు చేశారు. ఆ భవనాన్ని నేటికీ ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపి వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం పరిగి నియోజకవర్గ ఇంచార్జ్ లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు పసుల చంద్రయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ, దోమ మండల అధ్యక్షుడు చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.