
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. హెడ్కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లగూడ – చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు అధికారులు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. చేతి మణికట్టుకు నలుపు, పసుపు, ఎరుపు రంగు కలిగిన దారం ఉందని తెలిపారు. మృతుని ఒంటిపై నలుపు రంగు నైట్ ప్యాంట్, నలుపు రంగు టీ షర్ట్ ఽఉందన్నారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించి భద్రపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
● త్రుటిలో తప్పిన ప్రమాదం
● పలువురికి స్వల్ప గాయాలు
యాలాల: స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడంతో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండం పరిధిలోని గోరేపల్లి శివారులో జరిగింది. దేవనూరు నుంచి తాండూరు వైపు సుమారు 50 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతుంది. గోరేపల్లి శివారులోని మలుపు వద్ద స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దిగింది. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ గిరి తెలిపారు.
ఇంట్లో గంజాయి.. వ్యక్తి అరెస్టు
తాండూరు టౌన్: గంజాయి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాండూరు ఎకై ్సజ్ శాఖ ఇన్చార్జ్ సీఐ కె.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు తాండూరు ఎకై ్సజ్ పోలీసులు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో మహ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. అతను సేవించేందుకు కొనుగోలు చేసిన 125 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితున్ని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఇన్చార్జ్ సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆదిశేషు రెడ్డి, నిజాముద్దీన్, సిబ్బంది భీమయ్య, రవి, కిషోర్, రాధిక, ఆసిఫాబేగం, రవికిరణ్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి గాయాలు
కుల్కచర్ల: ప్రమాదవశాత్తు ముందు ఉన్న బైక్ను ఢీ కొని క్రిందపడి తీవ్రగాయాలైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గేటు దగ్గరలో ఘండిచెరువు గాదె కాలనీకి చెందిన తిరుపతయ్య కుల్కచర్ల వైపునకు వెళ్తున్నక్రమంలో ముందు ఉన్న వాహనాన్ని తగిలి అదుపుతప్పి క్రింద పడిపోయాడు. ఈ ఘటనలో తిరుపతయ్యకు తీవ్రగాయాలు అవ్వడంతో 108లో మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం (సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం) కింద విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే మైనార్టీ విద్యార్థులకు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్, పార్మీలు)నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికా రి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7993357103, 8978964132లలో సంప్రదించాలన్నారు.
నేడు గౌతాపూర్లో రెవెన్యూ సదస్సు
తాండూరు రూరల్: మండలంలోని గౌతాపూ ర్, బిజ్వార్ గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజ్వార్ అనుబంధ గ్రామం బొంకూర్ తోపాటు గౌతాపూర్ అనుబంధ గ్రామం గోపన్పల్లిలో సదస్సులు ఉంటాయని ఆయన తెలిపారు.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి