
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జెండా ఆవిష్కరించనున్న స్పీకర్ ప్రసాద్కుమార్
అనంతగిరి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10గంటలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ ప్రతీక్జైన్ పర్యవేక్షించారు. 10.05గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరణ, 10.10గంటలకు స్పీకర్ సందేశం, 10.25గంటలకు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 10.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటలకు గ్రామ పాలన అధికారుల నియామక ఉత్తర్వులు అందజేత, 11.10 గంటలకు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత, 11.20గంటలకు జాతీయ గీతంతో కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు.
నేటి ప్రజావాణి రద్దు
అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వాసులు విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
‘డబుల్’ ఇళ్లు ఇవ్వండి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్
అనంతగిరి: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న తమకు డబుల్ బెడ్రూం లేదా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం మున్సిపల్ కార్మికులతో సమావేశమై మాట్లాడారు. మధ్యలో నిలిచిన డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, బుచ్చయ్య, రాములు, లక్ష్మి, నర్సింలు, దశరథ, అనంతమ్మ, జ్యోతి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
● రూ.7.50 లక్షల విలువ చేసే 300 కిలోల నిషేధిత విత్తనాలు స్వాధీనం
● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
షాద్నగర్: గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేసిన వారిని పోలీసులు పట్టుకొన్న సంఘటన షాద్నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడుకు చెందిన జంపాని నాగేశ్వర్రావు కొంతకాలంగా వికారాబాద్ జిల్లా ద్యాచర్లలో రైతుల వద్ద కొంత పొలాన్ని కౌలు కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పల్నా డు జిల్లా అమరావతి మండలానికి చెందిన వీర వసంతరావు ద్వారా నకిలీ పత్తి విత్తనాలు తెప్పిస్తున్నాడు. మేలైన విత్తనాలు అని నమ్మించి చుట్టు పక్కల ఉండే రైతులకు విక్రయిస్తున్నా డు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి షాద్నగర్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. పట్టణ శివారులోని బక్కర్మన్ గార్డెన్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో నిషేధిత పత్తి విత్తనాలను కారులో తీసుకొచ్చి ముగ్గురు రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారం అందుకున్న షాద్నగర్ వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు నకిలీ విత్తనా లు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న వారిని పట్టుకొన్నారు. వారి నుంచి రూ.7.5లక్షల వి లువ చేసే 300కిలోల నకిలీ విత్తనాలను, కారు ను స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వర్రావు, వీర వసంతరావుతోపాటు వికారాబాద్ జిల్లా ఐయాన్పూర్కు చెందిన రైతు గంగారపు పాండు, దాచారం గ్రామానికి చెందిన టెక్నో సీడ్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాకలి రాములు, ఐనాపూర్కు చెందిన రైతు నెమలి రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో షాద్నగర్ ఇన్చార్జి ఏడీఏ నిషాంత్కుమార్, ఏఈఓ తేజ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్, మేడ్చల్ ఎస్ఓటీ ఎస్ఐ ధనుంజయ పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం