మొక్కుబడిగా అవతరణ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా అవతరణ వేడుకలు

Jun 3 2025 7:03 AM | Updated on Jun 3 2025 7:03 AM

మొక్క

మొక్కుబడిగా అవతరణ వేడుకలు

యాలాల: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఉదయం 9.30గంటల సమయంలో ఎంపీడీఓ పుష్పలీల జాతీయ జెండా ఆవిష్కరణకు ఇబ్బంది పడ్డారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రొఫెసర్‌జయశంకర్‌ సార్‌ చిత్రపటంతో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచాల్సి ఉండగా.. పాత చిత్రపటాన్నే ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ సైతం విషయం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అధికారుల తీరుపై కాంగ్రెస్‌ నేతల గుర్రు

ధారూరు: రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మండల పరిధిలో సోమవారం నామమాత్రంగా నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించకుండానే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సమయపాలన సైతం పాటించలేదని మండల పరిషత్‌ సముదాయంలో మినహాయిస్తే ఎక్కడా రాష్ట్ర గీతాన్ని ఆలపించలేదని మండిపడ్డారు.

అలంకరణకు నోచుకోని కార్యాలయాలు

బషీరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అధికారులు నామమాత్రంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఏ ఒక్క కార్యాలయం విద్యుత్‌ అలంకరణకు నోచుకోలేదు. తహసీల్‌ కార్యాలయం, మండల మహిళా సమాఖ్య ఎదుట తెలంగాణ తల్లి చిత్రపటం లేకపోవడంతో పక్కనే ఉన్న మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద ఉంచిన ఫొటో తీసుకువచ్చి ఆవిష్కరణ పూర్తి చేశారు. కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటంతో పాటు పాత తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచారు. పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి చిత్రపటం లేకుండానే జెండావిష్కరణలు చేశారు.

మారని తెలంగాణ తల్లి చిత్రపటం.!

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

మొక్కుబడిగా అవతరణ వేడుకలు 1
1/1

మొక్కుబడిగా అవతరణ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement