
ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి బలవన్మరణం
దోమ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దోమ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. బాలాపూర్ గ్రామానికి చెందిన బాపురం దస్తయ్య(45) కొద్ది రోజుల క్రితమే కూతురు వివాహం ఘనంగా జరిపించాడు. మామిడి తోటల వ్యాపారం చేకుంటూ, చిట్టీలు నడుపుతూ, చిన్న హోటల్ కొనసాగిస్తున్నాడు. మామిడి, చిట్టీల వ్యాపారంలో నష్టంతో పాటు హోటల్ కూడా సరిగా నడవక ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో మానసింకగా కృంగిపోయిన ఆయన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య వెంకటమ్మ, కూతురు అంజలి, కుమారులు సాయి, హర్ష ఉన్నారు.