సదస్సులు సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

సదస్సులు సద్వినియోగం చేసుకోండి

Jun 4 2025 7:35 AM | Updated on Jun 4 2025 7:35 AM

సదస్సులు సద్వినియోగం చేసుకోండి

సదస్సులు సద్వినియోగం చేసుకోండి

అనంతగిరి: భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సూచించారు. మంగళవారం ఆయన వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎర్రవల్లి, ఆలంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల వివరాలను తహసీల్దార్‌ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా, పీఓపీ, భూ విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, పాస్‌ పుస్తకాల అందజేత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పారు. సదస్సులో వచ్చిన ఆర్జీల రిజిస్టర్‌ను పరిశీలించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

అనంతరం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ మండల పరిధిలోని పెండ్లిమడుగులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్‌కుమార్‌, ఎంపీఓ దయానంద్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపాలి

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement