
యువత క్రీడల్లోనూ రాణించాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి
బొంరాస్పేట: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాందార్పూర్లో నిర్వహించిన బీపీఎస్ (బొంరాస్పేట ప్రీమియర్ లీగ్) నిర్వహించారు. తొమ్మిది జట్లలో బొంరాస్పేట్ కెప్టెన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆర్సీబీ బృందం రన్నరప్గా నిలిచింది. ఈ జట్లకు మంగళవారం కప్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, జయకృష్ణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.