కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Jun 3 2025 7:03 AM | Updated on Jun 3 2025 7:03 AM

కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కొడంగల్‌: కొడంగల్‌ను రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మైనార్టీ మహిళలకు 2వేల కుట్టుమిషన్లు, ఎనిమిది మంది దివ్యాంగులకు ట్రై మోటార్‌ సైకిళ్లు, కడా కార్యాలయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.10వేల కోట్లతో పనులు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్‌ కళాశాల మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కొడంగల్‌ ప్రభుత్వాస్పత్రిని టీచింగ్‌ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసిన ఘతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడా అధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌అంబయ్య గౌడ్‌, నాయకులు ఓబెదుల్లా కోత్వాల్‌, మహ్మద్‌ యూసూఫ్‌, ప్రశాంత్‌, నయీమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, మైనార్టీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement