
ఉత్తమ కార్యదర్శిగా నర్సింలు
మోమిన్పేట: మండల పరిధిలోని ఏన్కతల పంచాయతీ కార్యదర్శి నర్సింలుకు ఉత్తమ కార్యదర్శి అవార్డుకు ఎంపికయ్యారు. మండలంలోని మోమిన్పేట, ఏన్కతల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
డీఎస్పీకి వినతిపత్రం అందజేత
తాండూరు టౌన్: దళిత యువకుని పెళ్లి బారాత్ను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత నెల 18న బెల్కటూర్లో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
తల్లిదండ్రులు మందలించారని..
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
కుల్కచర్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ ఉరేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన ఏముకంటి ఆంజనేయులు(26) తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో గత శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు, బంధువులను ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సోమవారం ఇప్పాయిపల్లి చెరువుకట్ట సమీపంలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి పరిశీలించగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం
డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి
కుల్కచర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. గ్రామాల్లో శాంతియుత వాతారణం కొనసాగాలన్నా అధికారుల ప్రాత కీలకమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య అన్నారు. సోమవారం తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎస్ఐ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మార్కెట్ కమిటీ డైరక్టర్లు రాంచంద్రయ్య, ఎల్లయ్య, భరత్కుమార్ రెడ్డి, నాయకులు కృష్ణయ్య, వినోద్, శ్రీను, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, గిర్దవారులు ఖాజా, రవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల మండిపాటు
కుల్కచర్ల: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రొటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించారని బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు బందయ్య, పార్టీ చౌడాపూర్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం అవతరణ వేడుకల అనంతరం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వరి, కంది విత్తనాల పంపిణీని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఉండటాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో కొంత హడావుడి నెలకొంది. అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి అధికారులు తీరును తప్పుబట్టారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, చెన్నయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ కార్యదర్శిగా నర్సింలు

ఉత్తమ కార్యదర్శిగా నర్సింలు

ఉత్తమ కార్యదర్శిగా నర్సింలు