
ప్రారంభం కాని సరఫరా
యాలాల: మూడు నెలల రేషన్ ముందే పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆదివారం నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాలాల మండలంలో మాత్రం మొదటి రోజున బియ్యం పంపిణీ చేయలేదు. మండల పరిధిలో మొత్తం 36 రేషన్ దుకాణాలు ఉండగా జూన్కు సంబంధించిన బియ్యం కోటా ముద్దాయిపేట, రేళ్ల గడ్డ తండాకు మాత్రమే స్టాక్ పాయించట్ నుంచి రేషన్ దుకాణానికి చేరింది. మిగిలిన రేషన్ షాపులకు బియ్యం సరఫరా జరగకపోవడంతో లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభం కాలేదు. కాగా మూడు నెలల కోటాకు సంబంధించిన నిల్వ ఉంచుకునే ప్రదేశం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కోటాకు సంబంధించి ఈపాస్ మిషన్ నుంచి లబ్ధిదారుల వివరాల సేకరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డీలర్లు పేర్కొంటున్నారు.