కార్పొరేట్‌కు దీటుగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు

May 29 2025 10:04 AM | Updated on May 29 2025 10:04 AM

కార్పొరేట్‌కు దీటుగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు

కార్పొరేట్‌కు దీటుగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు

పరిగి: పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. పరిగి పట్టణానికి ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల మంజూరు చేయడం సంతోషించ దగ్గ విషయమన్నారు. తుంకుల్‌గడ్డలో భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌చైర్మన్‌ అయూబ్‌, దోమ పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవరెడడి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు రాజపుల్లారెడ్డి పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కుల్కచర్ల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్లలో రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వీరస్వామి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు ముదిరాజ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్య క్షుడు రాంచందర్‌ నాయక్‌, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భరత్‌కుమార్‌ రెడ్డి, నాయకులు రాంరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి

దోమ: ప్రభుత్వ సబ్సిడీపై ఇచ్చే పచ్చి రొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండలం దిర్సంపల్లి రైతు సేవ కేంద్రంలో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్‌ నేతలతో కలసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవ కేంద్రంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. బస్తాకు రూ.2,140 ధర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ నేతలు సత్తయ్యగౌడ్‌, రాములుగౌడ్‌, బందయ్య, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, అఖిల్‌పాష, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement