పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

May 31 2025 6:58 AM | Updated on May 31 2025 6:58 AM

పేదలం

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవాబుపేట: కాంగ్రెస్‌ అంటే పేదలు, రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందన్నారు. అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ రామ్‌రెడ్డి, ఎంఈఓ అబ్దుల్‌ రెహమాన్‌, మాజీ సర్పంచ్‌ నర్సింలు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పరమేష్‌, పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మి,రెడ్డి, నాయకులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడాల కూల్చివేత

తాండూరు టౌన్‌: తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గానికి ఇరువైపులా వ్యాపారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్‌ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. తాండూరు మీదుగా 167 (ఎన్‌) నేషనల్‌ హైవే వెళ్తుండటంతో ప్రధాన రోడ్డును ఇందుకు అనుగుణంగా విస్తరించనున్నారు. పనులు ఆలస్యం కావడంతో సదరు వ్యాపారులు ఇష్టానుసారంగా అనుమతి లేని చోట అక్రమంగా షెడ్డు, మెట్లు ఇతర కట్టడాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మున్సిపల్‌ అఽధికారులు పోలీసుల సహాయంతో కట్టడాలను కూల్చేశారు. తాండూరు బస్టాండు నుంచి చించోళి రోడ్డు మార్గంలో సెయింట్‌ మార్క్స్‌ పాఠశాల వరకు అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేందుకు సమాయత్తమయ్యా రు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు అధికారుల తీరును తప్పు పట్టారు. ఏమాత్రం సమయం ఇవ్వకుండా హుటాహుటిన కూల్చేయడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారమే అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

ఎన్‌ఎంఆర్‌పై సమీక్ష

అనంతగిరి: ప్రభుత్వ విభాగాల్లో వేతన సవరణ కమిటీ పరిగణనను బట్టి దినసరి కార్మికులకు జీత భత్యాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నాన్‌ మాస్టర్‌ రోల్‌ ఉద్యోగ వేతన స్థిరీకరణ (ఎన్‌ఎంఆర్‌)పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న హాజరు పట్టిక(ఎన్‌ఎంఆర్‌)లో లేని కార్మికులకు వేతన సవరణ కమిటీ సిఫారసు మేరకు కనీస వేతనాలను అందించాలన్నారు. నైపుణ్యం, నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం కలిగిన దినసరి కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాల పెంపునకు అనుగుణంగా అందించాలన్నారు. గ్రామీణ, మున్సిపల్‌ పరిధిల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వాల్యా నాయక్‌, డీహెచ్‌ఎస్‌ఓ సత్తార్‌, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రవి ప్రసాద్‌, డీబీసీడీఓ ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు కేంద్రం అండ

మొయినాబాద్‌: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజీగూడ, రెడ్డిపల్లి గ్రామాల కిసాన్‌ కవన్‌ కార్యక్రమంలో భాగంగా శ్రీ అస్పద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్షేమ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ సహకారంతో రైతులకు మందులు పిచికారీ చేసే సమయంలో వేసుకునే కిట్లు పంపిణీ చేశారు.

పేదలందరికీ  ఇందిరమ్మ ఇళ్లు 
1
1/1

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement