
అభివృద్ధిలో అగ్రగామి
● రూ.10 వేల కోట్లతో పనులు ● శరవేగంగా నిర్మాణాలు ● సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి
కొడంగల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ.10 వేల కోట్లతో నియోజకవర్గం దశ దిశ మార్చేలా పనులు సాగుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు మొదటి ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ, జూనియర్ కళాశాలలు మంజూరు చేశారు. కొడంగల్ పట్టణంలో 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రి పనులు చకచకా సాగుతున్నాయి. రూ.6 కోట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణ పనులు ఊపందుకున్నాయి. అభివృద్ధి పనుల్లో వేగం పెంచినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి తెలిపారు.

అభివృద్ధిలో అగ్రగామి

అభివృద్ధిలో అగ్రగామి

అభివృద్ధిలో అగ్రగామి