
నో స్టాక్..!
శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025
జిల్లాలో ఎరువుల కొరత
● ఫెర్టిలైజర్ దుకాణాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు ● దగ్గరపడుతున్న విత్తు సమయం ● ఆందోళనలో అన్నదాత
10లోu
వికారాబాద్: జిల్లాలో ఎరువుల కొరత రైతన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫెర్టిలైజన్ దుకాణా ల్లో ఎరువుల కొరత ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సారి వర్షాలు ముందుగానే పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా విత్తుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కొనుగోలుపై దృష్టి సారించారు. ప్రస్తుత సీజన్కు అవసరమైన ఎరువుల్లో 15 శాతం కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం దుక్కి ఎరువుగా వాడాల్సిన డీఏపీ కొరత తీవ్రంగా ఉంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు.
అవసరం కొండంత.. ఉన్నది గోరంత
జిల్లాలో ఎరువుల అవసరం కొండంత ఉంటే ఉన్నది మాత్రం గోరంతే. సాగుకు సరిపడా విత్తనాలు ఉండటం రైతులకు కొంత మేర ఉపశమనం కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్లో 5,61,719 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు 1,13,851 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 14,429 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత సీజన్కు 39,898 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 8,088 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. డీఏపీ 27,516 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 2,408 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంఓపీ 8,585 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 173 మెట్రిక్ టన్నులే ఉంది. కాంప్లెక్స్ ఎరువులు 35,305 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 3,530 మెట్రిక్ టన్నులు ఉంది. ఎస్ఎస్పీ ఎరువులు 2,547 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 230 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది.
ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5.61లక్షల ఎకరాలు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.61లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయా పంటలు సాగు చేయవచ్చునని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతేడాది 2.57లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈ సారి 2.58 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందరి అంచనా వేసింది. వరి 1,31,075 ఎకరాల్లో, కందులు 1.10లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 26,908 ఎకరాల్లో సాగు చేయవచ్చని భావిస్తున్నారు. పెసలు 14,568 ఎకరాలు , మినుములు 5,716 ఎకరాలు జొన్నలు 2,572 ఎకరాలు, సోయాబీన్ 2,043 ఎకరాలు, ఇతర పంటలు 7275 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న, జీలుగ, జనుము, సోయాబీన్, కంది విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఫెర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో అవసరం మేరకు పత్తి విత్తనాలు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు ఆయా పంటలకు సంబంధించి 41,297 క్వింటాళ్ల విత్తనాలు, 5,16,426 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
న్యూస్రీల్
జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,61,719 ఎకరాలు అవసరమైన ఎరువులు 1,13,851 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 14,429 మెట్రిక్ టన్నులు అవసరమైన విత్తనాలు 41,297 క్వింటాళ్లు
ప్రభుత్వానికి నివేదించాం
ప్రస్తుత సీజన్కు ఏ మేరకు విత్తనాలు,ఎరువులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. సాగుకు సరిపడా విత్తనాల ను అందుబాటులో ఉంచాం. డీఏపీ కొంత మేర కొరత ఉంది. ఈ విషయా న్ని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి.
– మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

నో స్టాక్..!

నో స్టాక్..!