
పశువుల అక్రమ రవాణా నేరం
అనంతగిరి: బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను నిరోధించాలని ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న బక్రీద్ పండుగ ఉన్నందున పశువులను అక్రమ రవాణా చేయకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 8 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చట్టవిరుద్ధంగా పశువులను రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పశువుల క్రయ విక్రయాలు జరిపే రైతులు, వ్యాపారులు సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ అధికారులచే ధ్రువీకరించిన రశీదులను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణా విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అధికారి సదానందం, వికారాబాద్, తాండూరు, పరిగి డివిజన్ల డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు
ఎస్పీ నారాయణరెడ్డి

పశువుల అక్రమ రవాణా నేరం