
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
దుద్యాల్: రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో జీలుగ విత్తనాలను వ్యవసాయ అధికారి నాగరాజ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంటయ్య, ఏఈఓలు భావన, రేణుక, మాణికేశ్వరి, జ్యోతి, పీఏసీఎస్ డైరెక్టర్ ఖాలీల్ పాషా, నాయకులు సీతారాంనాయక్, వెంకటయ్య, శ్రీశైలంగౌడ్, ఖాజా, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.