
పశువులకు వైద్యం అందించండి
పరిగి: పశువులకు సకాలంలో వైద్యం అందించాలని సంచార అంబులెన్స్ జిల్లా అధికారి భాగేష మిశ్రా సిబ్బందికి సూచించారు. బుధవారం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సంచార అంబులెన్స్లను మండల పరిధిలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, వైద్యులు ఎల్లప్పుడు అలర్ట్గా ఉండాలని సూచించారు. రైతులు పశువులకు ఏమైన సమస్య ఉందని కాల్ చేస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు.
సంచార అంబులెన్స్ జిల్లా అధికారి
భాగేష మిశ్రా