
రహదారి పనులకు నిధులు మంజూరు
కుల్కచర్ల: బండమీదితండా గ్రామ పంచాయతీలో పొలాలకు వెళ్లేందుకు రహదారికోసం మంజూరైన రూ.12లక్షలతో ఏపీఓ చంద్రశేఖర్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరూ ఒక్కతాటిపై ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉండే పనులను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పొలాలకు దారులు ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యవసాయ పంటలను మార్కె ట్లకు తరలించేందుకు, వ్యవసాయ పనుల నిర్వహణకు ట్రాక్టర్లను ఇతర వాహనాలను తీసుకవెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజు, వినోద్కుమార్, మోతిలాల్, ఆంజనేయులు, దశరత్, శివాజీ, నర్సింలు, శ్రీను పాల్గొన్నారు.