ఎకై ్సజ్‌ శాఖకు అవినీతి మరక | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ శాఖకు అవినీతి మరక

May 4 2025 8:12 AM | Updated on May 4 2025 8:12 AM

ఎకై ్సజ్‌ శాఖకు అవినీతి మరక

ఎకై ్సజ్‌ శాఖకు అవినీతి మరక

● సహచర ఉద్యోగినీ వదలని వైనం ● జిల్లా కార్యాలయంలోనే చేతివాటం ● నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే ● గుడ్‌విల్‌ పేరుతో ఉన్నతాధికారుల వరకు.. ● ఏసీబీ దాడులతో అసలు విషయం వెలుగులోకి..

వికారాబాద్‌: ఎకై ్సజ్‌ శాఖ జిల్లా కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. బెల్టు దుకాణాలు, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్ల నుంచి ముక్కు పిండి మామూళ్లు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సొంత శాఖ, సహచర ఉద్యోగులను కూడా వదిలిపెట్టరని తాజా ఘటనతో రుజువైంది. శుక్రవారం ఎకై ్సజ్‌ జిల్లా కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారనే చర్చ జరుగుతోంది.

ఎవరి వాటా వారికి..

జిల్లా ఎకై ్సజ్‌ శాఖలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వసూలు చేసిన మొత్తంలో ఎవరి వాటాలు వారికి వెళ్లి పోతాయనేది బహిరంగ రహస్యం. విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ టీంలు సైతం జిల్లా బాస్‌ కనుసన్నల్లోనే దాడులు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తాయనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ నుంచి ఫుల్‌ బాటిల్‌, బీర్ల అమ్మకాల్లో రూ.10 నుంచి రూ.50 వరకు అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎప్పుడైనా బెల్టు షాపులనిర్వాహకులు పట్టుబడితే వారికి మద్యం దుకాణ యజమానులు అండగా నిలుస్తున్నారు. కేసులు కాకుండా చూస్తున్నారు. ఎకై ్సజ్‌ అధికారులు మ ద్యం దుకాణాల నుంచి నెలనెలా మామూళ్లు తీసు కుంటున్నందునే బెల్టు షాపుల విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో మద్యం షాపు నుంచి వేల రూపాయలు మామూళ్ల రూపంలో అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పేరుతో అప్పుడప్పుడు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు గాలికి..

దుకాణాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు రూపొందించినా అవి ఎక్కడా అమలు కావడం లేదు. ఉదాహరణకు పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఎన్కెపల్లిగేట్‌ వద్ద ఆలయానికి 50 మీటర్ల దూరంలోనే మద్యం షాపు ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయం వద్ద బాలికల పాఠశాల ఉన్నా ఇక్కడ కూడా మ ద్యం షాపు ఏర్పాటు చేశారు. దీనిపై కాలనీ వా సులు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మద్యం దుకాణాల వద్ద పార్కింగ్‌ స్థలాలు ఉండాలి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు.

వ్యాపారాన్ని బట్టి..

జిల్లాలో మొత్తం 59 మద్యం దుకాణాలు ఉన్నాయి. రోజుకు రూ.60 వేలకు మించి వ్యాపారం జరిగే షాపు నుంచి నెలనెలా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవి నెలనెలా తీసుకునే మామూళ్లకు అదనం అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్‌లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని మద్యం దుకాణ యజమానులు భయపడుతున్నట్లు సమచారం. ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు మూమూళ్లు తీసుకుంటున్న కారణంగానే గ్రామాల్లో విచ్ఛలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఎకై ్సజ్‌ శాఖలో అవినీతి జలగలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement