తిరుపతి అర్బన్: ఆన్లైన్ యాప్ ఆధారంగానే జనగణన ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో 2026–27కు చెందిన జనగణన ( 16వ సెన్సస్ ఆపరేషన్స్)కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల శిక్షణ చేపట్టారు. డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో పాటు పలువురు హాజరయ్యారు. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనగణన పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు డైట్ కాలేజ్ లెక్చరర్ సుధారాణి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజ్, తిరుపతి ఉదయ్, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ రమాదేవి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజమోహన్ రెడ్డి, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు.


