అదరగొట్టిన అరగొండ ఆణిముత్యం
15 ఏళ్లకే రాష్ట్ర స్థాయిలో మెరిసిన ముద్దుగుమ్మ చిన్ననాటి నుంచే అందాల షో, డాన్స్, క్రికెట్పై మక్కువ సహస్రకు అభినందన వెల్లువ
తవణంపల్లె : చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంఅరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ కుమార్తె సహస్ర టీనేజీ విభాగం మిస్ ఆంధ్ర అందాల పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు. సహస్ర బెంగళూరులోని ఓర్కిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సహస్రకు చిన్న నాటి నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం, క్రికెట్తో పాటు డాన్స్పై మక్కువ. స్కూల్ యాజమాన్యం సైతం అందాలు షోలు నిర్వహించి సహస్రకు ప్రోత్సాహం అందించింది. ఈ క్రమంలోనే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ నుంచి బెంగళూరులోని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ స్కూల్లో క్రికెట్లోనూ కోచింగ్ తీసుకుంటోంది. డాన్స్లోనూ రాణిస్తోంది. సహస్ర అభిరుచికి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం తోడవడంతో నేడు మిస్ ఆంధ్ర పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది. క్రికెట్లోనూ చక్కటి కోచింగ్ తీసుకొని జాతీయ స్థాయిలో రాణి స్తుందని తల్లిదండ్రులు ఆకాక్షించారు. ఓర్కిడ్జ్ ఇంజర్నేషనల్ స్కూల్లో నాణ్యమైన విద్యతో పాటు అందాల పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం వల్లే తమ కుమార్తె సత్తా చాటిందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అరగొండ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మిస్ ఆంధ్ర రన్నరప్గా సహస్ర
అదరగొట్టిన అరగొండ ఆణిముత్యం


