సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు

Dec 9 2025 7:06 AM | Updated on Dec 9 2025 7:06 AM

సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు

సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు

తిరుపతితుడా: రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని ఏళ్ల నుంచి యాజమాన్యానికి విన్నవించినా పరిష్కరించకపోవడంతో సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సీఐటీయూ, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వరంలో సోమవారం రుయా సూపరింటెండెంట్‌తోపాటు కార్మిక శాఖ మంత్రికి, కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, జిల్లా కార్మిక శాఖ, సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్‌, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు జి మునిచంద్ర, నరసింహులు మాట్లాడుతూ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 రూల్‌ నంబర్‌ 71 ప్రకారం సమ్మె నోటీసులు 18 డిమాండ్లతో ప్రధానంగా ఈ సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. బుధవారం నుంచి కార్మికులందరూ 14 రోజులపాటు నల్ల బ్యాడ్జీలు ధరించి, తమ నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తారని, 14 రోజుల తర్వాత యాజమాన్యం చర్చించి సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెబాట పట్టాల్సివస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement