సియోల్లో శ్రీసిటీ బృందం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): విదేశీ పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో భాగంగా శ్రీసిటీ మార్కెటింగ్ బృందం సోమవారం కొరియాలో పర్యటించింది. ఈ సందర్భంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.శివశంకర్ నేతృత్వంలో సియోల్లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ మిషన్ చీఫ్ నిషికాంత్ సింగ్, జపాన్ ఉన్నతాధికారులను కలిసి, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి, 31 దేశాలకు చెందిన 240కు పైగా పరిశ్రమలను ఆకర్షించడంలో శ్రీసిటీ కీలక పాత్రను తెలియజేశారు. ఎల్జీ, సోలుమ్, హ్యుందాయ్ ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్ (హెచ్డీసీ), ఎస్కే ప్యుకోర్, ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రముఖ కొరియన్ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారికి వివరించారు.


