అనుక్షణం.. అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అనుక్షణం.. అప్రమత్తం

Oct 23 2025 9:24 AM | Updated on Oct 23 2025 9:24 AM

అనుక్షణం.. అప్రమత్తం

అనుక్షణం.. అప్రమత్తం

● క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎస్పీ సుబ్బరాయుడు ● సాయం కోసం 112 నంబర్‌కు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి ● శిథిలావస్థలోని భవనాలు, హోర్డింగ్‌ బోర్డులు, చెట్లు, విద్యుత్‌ తీగల దగ్గర ఉండకూడదు. ● వాగులు, వంకలు, చెరువులు, నదులు, లోతైన నీటి గుంతల వద్దకు వెళ్లకూడదు. ● అనవసరంగా బయట తిరగవద్దు. రోడ్లపై నీరు అధికంగా ఉన్న చోట రాకపోకలు సాగించవద్దు. ● కాలువలు, వాగులు ప్రవాహం దాటేందుకు యత్నించకూడదు. సెల్ఫీలు, రీల్స్‌ తీసుకోకూడదు. ● సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ షేర్‌ చేయకూడదు. ● ఎక్కడైనా చెట్లు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపోవడం, వాగులు పొంగడం జరిగితే వెంటనే పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించాలి. ● అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం 112 నంబర్‌ను సంప్రదించాలి.

తిరుపతి క్రైమ్‌ : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎడతెరపి లేని వానలకు రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గేవరకు సెలవులపై ఎవరూ వెళ్లకుండా సేవలందించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖీ నది చెక్‌డ్యామ్‌ను ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు, కాలువలను ఎవరూ దాటకుండా రోడ్డుపై ముళ్ల కంచెలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాము అందుబాటులో ఉంటామని, ఎవరైనా నేరుగా కూడా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన మాటల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement